కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

 Stock markets huge fall - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు    మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.  కేంద్రంలో నెలకొన్న  రాజకీయ సంక్షోభ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో  ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 522 పాయింట్లు పతనమై 33163 స్థాయికి పడిపోగా  నిఫ్టీ సైతం 165  పాయింట్లు క్షీణించి 10,195  వద్ద ట్రేడ్‌ అవుతోంది.   దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే....మెటల్  ఎనర్జీ   సెక్టార్లు టాప్‌ లూజర్‌గా ఉండగా   ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా, ఐటీ  నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌  షేర్లు మాత్రం అతి స్వల్పంగా లాభపడుతున్నాయి.

ఆర్‌ఐఎల్‌, , ఐటీసీ,  బీపీసీఎల్‌, ఐవోసీ, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, అల్ట్రాటెక్‌, ఐబీ హౌసింగ్, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, సిప్లా  నష్టపోతుండగా,  ఎంఅండ్‌ఎం, అరబిందో, ఇన్‌ప్రాటెల్‌, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, బాష్‌  అతి స్వల్ప లాభపడుతున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top