మార్కెట్ల నష్టాల ముగింపు: ఐటీ బౌన్స్ బ్యాక్
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. లాభాలతో కొత్త రికార్డులను నమోదు చేసిన మార్కెట్లలో మిడ్ సెషన్ తరువాత అమ్మకాల జోరు కొనసాగింది. దీంతో సెన్సెక్స్ 119 పాయింట్లు క్షీణించి 31,190 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 9637 వద్ద ముగిసింది. ఐటీ సెక్టార్ టాప్ విన్నర్గా ఉంది. టీసీఎస్ భారీగా లాభపడగా, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర లాభాలను ఆర్జించాయి. అలాగే నేచురల్ రబ్బర్ ధరలు నీరసిస్తుండటంతో ఇటీవల జోరందుకున్న టైర్ తయారీ కంపెనీల కౌంటర్లు మళ్లీ జోరందుకున్నాయి. టైర్ల షేర్లలో బాహుబలి ఎంఆర్ఎఫ్ సహా, అపోలో టైర్స్ , జేకే టైర్స్, సియట్ తదితర షేర్లు లాభాల బాటపట్టాయి. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్ నష్టపోయాయి.