లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం మొత్తం లాభాల్లోనే కొనసాగాయి. అదే ట్రెండును కొనసాగిస్తూ.. వారంలో చివరి రోజైన శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 27,316 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 పాయింట్లు మెరుగుపడి 8224 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. దాంతో పాటు రూపాయి కూడా కొద్దిగా బలపడింది. కాగా, ముంబైలో భారీ వర్షాలు, వరదల కారణంగా కమొడిటీ, బులియన్, ఫారెక్స్ మార్కెట్లకు శుక్రవారం సెలవు ప్రకటించారు.
సంబంధిత వార్తలు