ఆఖరి రోజు కూడా లాభాలే!
ముంబై: స్టాక్ మార్కెట్లకు 2014 సంవత్సరం అద్భుతంగా కలిసి వచ్చింది. గడిచిన ఐదేళ్లలో ఉత్తమ ఏడాదిగా నిలిచిన ఈ సంవత్సరం ఆఖరి రోజున కూడా మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 27,499 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 8,282 వద్ద క్లోజయింది.
గత ఏడాది డిసెంబరు 31న సెన్సెక్స్ 21,170 వద్ద క్లోజయింది. ఈ ఏడాది డిసెంబరు 31 ముగింపుతో పోలిస్తే బెంచ్మార్క్ ఇండెక్స్ 6329 పాయింట్లు లాభపడింది. పర్సెంటేజీవైజ్ చూస్తే దాదాపు 30 శాతం పెరిగింది. నిఫ్టీని చూస్తే గత ఏడాది డిసెంబరు 31న నిఫ్టీ 6,304 వద్ద క్లోజయింది. ఈ ఏడాది డిసెంబరు 31న 8,282 వద్ద ముగిసింది. అంటే 2014 మొత్తం మీద నిఫ్టీ 1978 పాయింట్లు లాభపడి 31 శాతానికి పైగా పెరిగింది.
మరిన్ని వార్తలు