లాభాలతో నేడు మార్కెట్లు షురూ!

SGX Nifty indicates Market may open up - Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 10261-10211 వద్ద సపోర్ట్‌!

సోమవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

నేడు (23న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.40 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు బలపడి 10,350 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 10,305 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  కోవిడ్‌ కేసులు అధికంగా నమోదైన న్యూయార్క్‌లోనూ లాక్‌డవున్‌ ఆంక్షలు ఎత్తివేయడానికితోడు, టెక్నాలజీ దిగ్గజాలు పుంజుకోవడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.5-1 శాతం మధ్య ఎగశాయి. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు 0.6 శాతం బలహీనపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. అయితే మూడు రోజులుగా సెంటిమెంటు బలపడిన కారణంగా నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభంకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. గురువారం(25న) జూన్‌ నెల డెరివేటివ్స్‌ ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా.. వరుసగా మూడో రోజు సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా రంగాలు అండగా నిలవడంతో సెన్సెక్స్ 180 పాయింట్లు జమ చేసుకుని 34,911 వద్ద ముగిసింది.  నిఫ్టీ సైతం 67 పాయింట్లు ఎగసి 10,311 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,261 పాయింట్ల వద్ద, తదుపరి 10,211 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,377 పాయింట్ల వద్ద, ఆపై  10,444 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,397 పాయింట్ల వద్ద, తదుపరి 21,085 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,049 పాయింట్ల వద్ద, తదుపరి 22,390 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,237 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 881 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top