నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 25,238.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 30 పాయింట్ల వద్ద ఆరంభమై 7,726 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు రూపాయి పుంజుకుంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 66.20 పైసలుగా నమోదైంది. ఇక రియాల్టీ, ఆటో, మెటల్, బ్యాంకింగ్, టెక్, ఐటీ రంగ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.