నష్టాల్లోకి జారుకున్న సూచీలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సోమవారం నాటి సీన్ నేడు కూడా రిపీట్ అయింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే కీలక సూచీలు లాభాలను కోల్పోయాయి. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 96 పాయింట్లు క్షీణించి 38,216 వద్ద నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,541 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, దాదాపు రంగాలూ నష్టాల్లోనే. ఒక్క ఐటీ మాత్రమే స్వల్పంగా లాభపడుతోంది.
హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, వేదాంతా, ఐటీసీ, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫ్రాటెల్, ఐబీ హౌసింగ్, గ్రాసిమ్ లూజర్స్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, విప్రో లాభాల్లో కొనసాగుతున్నాయి.
సంబంధిత వార్తలు