273 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితోఒక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా కుప్పకూలింది. చివరికి సెన్సెక్స్273 పాయింట్ల నష్టంతో 35, 217వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పతనమైన 10,671వద్ద ముగిశాయి. తద్వారా నిఫ్టీ 10700కు దిగువన ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిశాయి. ఐసీఐసీఐ, ఎల్ అండ్ టుబ్రో, టాటా మోటార్స్, ఎస్బీఐ, పవర్గ్రిడ్, బజాజ్ ఆటో నష్టపోయాయి. అలాగే అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లు కూడా నష్టపోయాయి. భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం నష్టపోగా హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇంకా టెక్ మహీంద్రా, హెచ్సీఎల్, సిప్లా కూడా లాభపడ్డాయి