లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే 50 పాయింట్లకు మేర లాభపడగా.. నిఫ్టీ 11వేల మార్కుకు పైన ట్రేడ్ అయింది. ప్రస్తుతం 112 పాయింట్ల లాభంలో 36,608 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంలో 11,048 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు నేటి ట్రేడింగ్లో లాభాలు పండిస్తున్నాయి. ఎక్కువగా ఎఫ్ఎంసీజీ, ఫైనాన్సియల్, మెటల్ రంగాల స్టాక్స్లో కొనుగోలు మద్దతు లభిస్తోంది. మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా లాభాల్లో నడుస్తోంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 6.3 శాతం జంప్చేసింది.
కంపెనీ శుక్రవారం కొనుగోలు ప్రకటన చేయడంతో ఈ మేర పైకి ఎగిసింది. యూపీఎల్తో పాటు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్, హెచ్పీసీఎల్, ఐవోసీ, ఎయిర్టెల్, ఐటీసీ, ఇన్ఫోసిస్ 4-1.25 శాతం మధ్య పెరిగాయి. అయితే మరోవైపు విప్రో 5 శాతం పతనంకాగా.. బజాజ్ ఆటో, హీరో మోటో, టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జీ, ఆర్ఐఎల్, టైటన్, ఎంఅండ్ఎం 2.5-0.4 శాతం మధ్య క్షీణించాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 38 పైసల లాభంలో 68.67 వద్ద ట్రేడవుతోంది.