వరుస లాభాలకు బ్రేక్‌

Sensex Snaps Four-Day Winning Streak; IndiGo Shares Slump  - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికినష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, చైనా ట్రేడ్‌చర్చల నేపథ్యంలో గ్లోబల్‌మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు అనంతరం మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 73 పాయింట్లు క్షీణించి 35,103 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 10,679వద్ద 10700 స్థాయికి దిగువన ముగిసింది. దాదాపు అన్నిసెక్టార్లు నీరసంగానే ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ బాగా నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, బయోకాన్‌, ఇండిగో, యూపీఎల్‌, ఐషర్‌, కోటక్‌మహీంద్ర, నష్టపోగా, సన్‌ఫార్మ, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top