డబుల్ సెంచరీ నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత పతనమై సెన్సెక్స్ ప్రస్తుతం 208 పాయింట్లు కుప్పకూలి 41104 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 12086 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12100 దిగువకు చేరింది. తద్వారా నాలుగురోజుల వరుసలాభాలకు చెక్ పడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. హీరోమోటా కార్ప్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, టైటన్, హెచ్సీఎల్, ఓఎన్జీసీ టాప్ విన్నర్స్గా కొనసాగుతుండగా, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్, రిలయన్స్, పవర్గ్రిడ్, భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి.
చదవండి : లాభాల స్వీకరణ, ఫ్లాట్గా సూచీలు