మార్కెట్ల పతనం : 10750 దిగువకు నిఫ్టీ

Sensex Sheds 200 Points, Nifty Loses 10,750 Level - Sakshi

సాక్షి,ముంబై:  అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో గ్లోబల్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీంతో దేశీయంగానూ అమ్మకాలు జోరందుకున్నాయి.  కీలక సూచీ  సెన్సెక్స్‌ 232 పాయింట్లు పతనమై 35,315వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 10,717 వద్ద ట్రేడవుతోంది.తద్వారా నిఫ్టీ 10750 దిగువకు చేరింది.  ఒక్క ఫార్మా తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువ సాగుతోంది.   హిందుస్తాన్‌ పెట్రలియం, ఐఓఎల్‌, వేదాంతా, ఇన్ఫోసిస్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  లుపిన్‌, గ్లెన్‌మార్క్‌ ఇన్పీ బీమ్‌, లాభపడుతోంది.

అటు  కరెన్సీమార్కెట్‌లో రూపాయి మరింత బలహీన పడింది. డాలర్‌ మారకంలో  0.23 పైసల నష్టంతో 68.21 వద్ద ఉంది. పసిడి ఎంసీఎక్స్‌ మార్కెట్లో పదిగ్రా. 113 రూపాయలుపుంజుకుని 31,087వద్ద వుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top