నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచీ బలహీనంగా ఉన్న కీలక సూచీలు చివరివరకు అదేబాటలోనడిచాయి. ముఖ్యంగా టర్కీ ప్రకంపనలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం వంటి ప్రతికూల అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లను వణించాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు క్షీణించి 37,663 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11,385 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఈ ప్రభావానికి లోనయ్యాయి. మెటల్ బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ నష్టపోగా, ఫార్మా లాభాల్లో ముగిసింది.
కొటక్ బ్యాంక్, వేదాంతా భారీగా నష్టాలతో టాప్లూజర్స్గా నిలిచాయి. జీ, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, ఐబీ హౌసింగ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, విప్రో, ఎల్అండ్టీ తదితర షేర్లు నష్టపోగా, కాగా మరోవైపు గెయిల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి.