స్టాక్మార్కెట్లు మళ్లీ ఫామ్లోకి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. గత రెండు రోజులుగా నష్టాలతో కొనసాగిన మార్కెట్లు సెంచరీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 37,792 వద్ద, నిప్టీ 42 పాయింట్లు ఎగిసి 11397వద్ద కొనసాగుతున్నాయి. పీఎస్యూ బ్యాంకింగ్స్లో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. టాటా స్టీల్, ఐసీఐసీఐ,ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్ లాభపడుతున్నాయి. హెచ్యూఎల్, సన్ఫార్మా, కొటక్ బ్యాంక్ , టాటామోటార్స్, ఎన్టీపీసీ నష్టపోతున్నాయి.
మరిన్ని వార్తలు