లాభాల్లోకి మార్కెట్లు : 200 పాయింట్లు జూమ్‌

Sensex Rises Over 200Points As Markets Recover Early Losses - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లోకి మళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో  బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు పుంజుకున్నాయి. నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాయి.  మిడ్‌ సెషన్‌ తరువాత  కొనుగోళ్లతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 211 పాయింట్లు  ఎగిసి 36,275కు చేరింది. నిఫ్టీ సైతం 70 పాయింట్లు పెరిగి 10932 వద్ద ట్రేడవుతోంది. ఆటో, మెటల్‌, బ్యాంక్స్‌  రియల్టీ బాగా లాభపడుతున్నాయి. అయితే ఐటీ 1 శాతం క్షీణించింది.

టాటా మోటార్స్‌ 8 శాతం  ఎగిసి టాప్‌ విన్నర్‌గా ఉంది. ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, హీరో మోటో, బీపీసీఎల్‌, ఐవోసీ, ఎన్‌టీపీసీ, ఐషర్‌, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌ 5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, జీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సిప్లా 2.3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top