లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లు పైకి ఎగియగా... నిఫ్టీ 10,550ను అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 95 పాయింట్ల లాభంలో 34,395 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంలో 10,570 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా సంకేతాలు సానుకూలంగా వస్తుండటంతో, మార్కెట్లు లాభపడినట్టు విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 142 పాయింట్లు పైకి పెరిగింది.
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు సెలవును పాటించగా.. అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈలో రియల్టీ 1.6 శాతం జంప్చేయగా.. పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం పతనమైంది. మెటల్, ఐటీ రంగాలు 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ప్రారంభంలో వేదాంతా, భారతీ, టెక్ మహీంద్రా,అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, విప్రో, గెయిల్, ఆర్ఐఎల్ లాభపడగా.. ఇన్ఫ్రాటెల్, యాక్సిస్, పవర్గ్రిడ్, హీరోమోటో, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఏషియన్ పేయింట్స్, ఐసీఐసీఐ, బీపీసీఎల్, ఓఎన్జీసీ నష్టపోయాయి.