లాభాల సెంచరీ: టీసీఎస్‌ టాప్‌

Sensex Rises 100 Points, TCS Edges Higher Ahead of Q4 Results - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంతో 34, 436 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 10,558 వద్ద కొనసాగుతోంది.   పీఎస్‌యూ బ్యాంకింగ్‌ నష్టపోతోంది. మెటల్‌ ఇండెక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఐటీ, హెల్త్‌కేర్‌ పాజిటివ్‌గా ఉన్నాయి.   హిందాల్కో, వేదాంతా, టాటాస్టీల్‌, కోల్‌గేట్‌, జీ, అల్ట్రాటెక్‌, ఇండస్‌ఇండ్, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా లాభపడుతుండగా, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, యాక్సిస్‌, బరోడా బ్యాంక్‌ నష్టపోతున్నాయి.  అలాగే  ఫలితాలపై  పాజిటివ్‌ అంచనాల నేపథ్యంలో  టీసీఎస్‌ బాగా లాభపడుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top