లాభాల జోష్: 11వేల దిశగా నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 166పాయింట్లు ఎగిసి 36,336 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 10,908 వద్ద కొనసాగుతోంది. మరోసారి ఇప్పటికే 10900 దాటేసిన నిఫ్టీ 1వేల మార్క్వైపు నిఫ్టీ పరుగులు తీస్తోంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, జీ, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఐటీసీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తద్వారా డిసెంబర్ సిరీస్ లాభాలతో ఉత్సాహంగా ఆరంభమైంది.
మరోవైపు డాలరు మారకంలో రూపాయి వరుసగా లాభపడుతూ వస్తోంది. గురువారం నాటిముగింపుతో పోలిస్తే 17పైసలు ఎగిసిన రూపాయి 69.67 వద్ద ఉంది. గురువారం 69.84వద్ద ముగిసింది.
మరిన్ని వార్తలు