ప్రారంభంలోనే అదరగొట్టాయి..

Sensex Up Over 150 Points - Sakshi

ముంబై : ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు, దేశీయంగా రెండు రోజులుగా మెరుగుపడ్డ సెంటిమెంటు ఇన్వెస్టర్లకు మంచి జోష్‌నిచ్చింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 153 పాయింట్ల లాభంలో 35,314కు చేరింది. 10,700 మార్కు పైన ప్రారంభమైన నిఫ్టీ సైతం 10,612 వద్ద ట్రేడవుతోంది. 

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్‌, ఆటో 1-0.5 శాతం మధ్య లాభాలను ఆర్జించాయి. అంచనాలకు తగ్గట్టు క్యూ2 ఫలితాలను ప్రకటించడంతో టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్టాక్‌ 3 శాతం పెరిగింది. ఇతర టాప్‌ గెయినర్స్‌లో యస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌ ఉండగా... ఓన్‌జీసీ, బీపీసీఎల్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి. ప్రస్తుతం నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల షేర్లలో కొంత అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. దీంతో 400 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ కాస్త లాభాలను పోగొట్టుకుంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top