డబుల్‌ సెంచరీతో ఓపెన్‌

Sensex Opens Over 200 Points, Nifty Surpasses 11100 - Sakshi

ముంబై : బుధవారం ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా జంప్‌ చేసింది. నిఫ్టీ 11,100 మార్కును బీట్‌ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 121 పాయింట్ల లాభంలో 36,773 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంలో 11,099 వద్ద ట్రేడవుతున్నాయి.

అన్ని రంగాల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. బ్యాంక్‌, ఆటో, మెటల్స్‌ ఎక్కువగా లాభాల పంట పండిస్తున్నాయి. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా ఒక శాతం మేర పైకి ఎగిసింది. అటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ మాత్రం ఫ్లాట్‌గా 72.70 వద్ద ప్రారంభమైంది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top