నష్టాలతో ప్రారంభం : స్వల్పంగా రికవరీ
ముంబై : అమెరికా గణాంకాలు, కొనుగోళ్ల జోరుతో ఉరకలేసిన నిన్నటి దేశీయ స్టాక్ మార్కెట్లు, నేడు నెమ్మదించాయి. సోమవారం చోటుచేసుకున్న ర్యాలీకి నేడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు జనవరి నెల ఇండస్ట్రియల్ అవుట్పుట్, ఫిబ్రవరి నెల సీపీఐ ద్రవ్యోల్బణ డేటా కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. వీటి ప్రభావంతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, వెంటనే స్వల్పంగా కోలుకున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ స్వల్పంగా 27 పాయింట్ల లాభంలో 33,944 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంలో 10,431 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 స్టాక్స్లో అతిపెద్ద లూజర్గా టీసీఎస్ నిలుస్తోంది. బిగ్ బ్లాక్ డీల్ అనంతరం టీసీఎస్ షేరు 5 శాతానికి పైగా పడిపోయింది. 6 బ్లాక్ డీల్స్లో 3 కోట్లకు పైగా టీసీఎస్ షేర్లు ట్రేడ్ అయినట్టు తెలిసింది. నిఫ్టీ మిడ్క్యాప్ 38 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ బ్యాంకు కూడా ఫ్లాట్గా ట్రేడవుతోంది. యూసీఓ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, పీఎన్బీ, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, శ్రీ రేణుక, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, బయోకాన్ స్టాక్స్ 5 శాతం వరకు కిందకి పడిపోయాయి.
మరిన్ని వార్తలు