లాభాల ప్రారంభం: ఐటీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 156 నిఫ్టీ 50పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. తద్వారా నిఫ్టీ 10600 కి ఎగువన కొనసాగుతోంది. చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఆయిల్అండ్గ్యాస్ , ఆటొ సెక్టార్ బాగా లాభపడుతోంది. మరోవైపు రుపీ బలపడటంతో ఐటీ సెక్టార్ నష్టపోతోంది. గ్రాసిం, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ , జెట్ ఎయిర్వేస్ హెచ్పీసీఎల్, బీపీసీఎల్, టాటా స్టీల్, టాప్ విన్నర్స్గా ఉండగా సన్ఫర్మా , అశోక్లేలాండ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర టాప్ లూజర్స్గా ఉన్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 70 డాలర్ల దిగువకు చేరింది. అటు దేశీయ కరెన్సీ రుపీ డాలరుమారకంలో బలంగా ట్రేడింగ్ను ప్రారంభించింది. 81 పైసలు పుంజుకుని 72 వద్ద 8 వారాల గరిష్టానికి చేరింది.
మరిన్ని వార్తలు