సెంచరీతో సెన్సెక్స్‌ స్టార్ట్‌

Sensex Opens Up 100 Pts, Nifty Above 10400 On Global Cues - Sakshi

ముంబై : ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వీస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు పైకి జంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ సెంచరీని బీట్‌ చేసింది.111 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌, ప్రస్తుతం 132 పాయింట్ల లాభంలో 33,920 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు బలపడి 10,415 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా..  మెటల్‌ ఇండెక్స్‌ మెరుపులు మెరిపిస్తోంది. మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం జంప్‌ చేసింది. 

ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా, రియల్టీ సైతం 0.5 శాతం పుంజుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో యస్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, కొటక్‌ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, సిప్లా 1.6 శాతం లాభపడ్డాయి. భూషణ్‌ స్టీల్‌, అపోలో టైర్స్‌, సువేన్‌ లైఫ్‌ 1 శాతం కిందకి పడిపోయింది. చైనా ఫ్రీ ట్రేడ్‌ సంకేతాలు ఇవ్వడంతో గ్లోబల్‌ మార్కెట్లు కోలుకున్నాయి. దీంతో దేశీయంగా కూడా మార్కెట్లు లాభపడుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top