వరుసగా రెండో రోజు లాభాలు
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరింత జోరందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్ ఒక దశలో 420 పాయింట్లకుపైగా జంప్చేసింది. నిఫ్టీ కూడా అదే జోరును కొనసాగించింది. అయితే మిడ్సెషన తరువాత స్వల్పంగా వెనక్కి తగ్గిన మార్కెట్లలో సెన్సెక్స్ 256 పాయింట్లు లాభంతో 37,583 వద్ద, నిఫ్టీ సైతం 77 పాయింట్లు ఎగసి 11,109 వద్ద ట్రేడవుతోంది. తద్వారా వారాంతంలో స్థిర ముగింపు సంకేతాలిస్తున్నాయి.
అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, రియల్టీ, ఆటో లాభాల్లో ఉన్నాయి. ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. ఐబీ హౌసింగ్ 11 శాతం జంప్చేయగా.. వేదాంతా, ఐషర్, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే యస్ బ్యాంక్, ఐటీసీ, కోల్ ఇండియా, గెయిల్, ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి.
మరిన్ని వార్తలు