నష్టాలకు చెక్: భారీ లాభాలు
సాక్షి, ముంబై : ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నస్టాక్మార్కెట్లు చివరికి భారీ లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మిడ్సెషన్ తరువాత 350 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 312 పాయింట్లు ఎగిసి 39,435 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 97 పాయింట్లు ఎగసి 11,797 వద్ద పాజిటివ్గా క్లోజ్ అయింది. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పి కీలక మద్దతు స్థాయికి ఎగువన ముగిసింది.
దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో, ఫార్మా రంగాల షేర్ల లాభాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, యాక్సిస్, టాటా స్టీల్, హిందాల్కో, ఎన్టీపీసీ, ఐవోసీ, గ్రాసిమ్, టైటన్ టాప్ విన్నర్స్గానూ, యస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, ఎల్అండ్టీ, యూపీఎల్, హెచ్యూఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్గానూ నిలిచాయి. అటు డాలరుమారకంలో రుపీకూడా పాజిటివ్గా ముగిసింది. ఆరంభంలోనే రుపాయి 13పైసలు పుంజుకుంది.