నష్టాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. బ్యాంక్స్, ఆటో, రియాల్టీ స్టాక్స్ భారీ ఒత్తిడితో సెన్సెక్స్ ఒక దశలో 300పాయింట్లు పతనమైనంది. నిఫ్టీ కూడా 11700 స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం 130 పాయింట్లు క్షీణించి 38937వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 11707 వద్ద కొనసాగుతోంది. ఎస్ బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది. దీంతో నిప్టీ బ్యాంకు ఇండెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 400 పాయింట్లకు పైగా నష్టపోయింది.
ఇండస్ ఇండ్, రిలయన్స్, ఇండియా బుల్స్, భారతి ఇన్ప్రాటెల్, హీరో మోటోకార్ప్, మారుతి నష్టపోతున్నాయి.