చివరికి మళ్లీ రికార్డులు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులను కొల్లగొడుతున్నాయి. బుధవారం 35వేలకు పైన ముగిసిన సెన్సెక్స్, నేటి ట్రేడింగ్లో సరికొత్త గరిష్టాలకు చేరింది. 178 పాయింట్ల లాభంలో 35,260 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డుల్లో 28 పాయింట్ల లాభంలో 10,817 వద్ద క్లోజైంది. చివరిలో అస్థిరమైన ట్రేడింగ్ చోటుచేసుకున్నప్పటికీ, రికార్డు స్థాయిల్లో ముగియడం విశేషం. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ భారీ లాభాలతో షురూ అయింది. నిఫ్టీ కూడా నేటి ఇంట్రాడేలో 11వేల వైపుకు శరవేగంగా ప్రయాణించి, చివరికి కాస్త నెమ్మదించింది.
ప్రధానంగా రియల్టీ, మెటల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. మిడ్క్యాప్స్లో మైండ్ట్రి 9 శాతం ర్యాలీ కొనసాగించగా.. ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, ఐటీసీ 3 శాతం లాభాలు పండించాయి. వీటితో పాటు ఇండియా బుల్స్, ఐటీసీ, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లాభాల్లో నడిచాయి. అయితే ఆర్కామ్ షేర్లు మాత్రం 10 శాతం నష్టపోయాయి. ఆర్కామ్తో పాటు భారతీ ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్లు ఎక్కువగా నష్టపోయాయి.