లాభాలు : 10500 ఎగువకు నిఫ్టీ

Sensex, Nifty open higher banks in focus - Sakshi

10500 ఎగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై :దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసిన సూచీలు ఉత్సాహంగా కొన సాగుతున్నాయి. సెన్సెక్స్ 302 పాయింట్ల లాభంతో 35705 వద్ద, నిఫ్టీ 85  పాయింట్ల లాభంతో 10515 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిప్టీ 10 500, సెన్సెక్స్ 35700 ఎగువకు చేరాయి. నిఫ్టీ బ్యాంకు 22వేల ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్లతో కళ కళ లాడు తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో షేర్ల కొనుగోళ్లు సూచీలకు మద్దతునిస్తున్నాయి. ఎం అండ్ ఎం, టైటన్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్ జీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top