సిరీస్‌ నష్టాల ముగింపు, 11వేల కిందికి నిప్టీ

 Sensex, Nifty Ends in Losses - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగవ రోజుకూడా నష్టాలతోనే ముగిశాయి. అంతేకాదు ఈ సిరీస్‌ చాలా బలహీనంగా ముగిసింది. సెన్సెక్స్‌ 218 పాయింట్లు కోల్పోయి 36,324 వద్ద, నిఫ్టీ 76పాయింట్ల నష్టంతో 10,977వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోగా, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. రియల్టీ, మెటల్‌సెక్టార్‌ నష్టాల్లో ముగిసింది. అయితే ఐటీ,ఫార్మా మాత్రం ఆకర్షణీయంగా నిలిచింది. లాగే అడాగ్‌ షేర్లు అన్నీ నష్టపోయాయి. భారతి ఇన్‌ ఫ్రాటెల్‌ ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌. పవర్‌గ్రిడ్‌ గెయిల్‌, లుపిన్‌, కోల్‌ ఇండియా లాభపడగా ఎస్‌బ్యాంకు, ఇండియాబుల్స్ ఫైనాన్స్‌ ‌, బజాజ్‌ ఫిన్‌న్‌సర్వ్‌, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌,యాక్సిస్‌, ఓఎన్‌జీసీ టాప్‌లూజర్స్‌గా నిలిచాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top