అమ్మకాల ఒత్తిడి : నష్టాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ ఒత్తిడితో రోజంతా భారీగా నష్టాలు పాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికీ నష్టాలోనే ముగిశాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి, 33,775 వద్ద ముగియగా.. నిఫ్టీ 74 పాయింట్లు నష్టాలు పాలై, 10,400కి కింద 10,378 వద్ద క్లోజైంది. నేటి ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే నడిచాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను ఎదుర్కొన్నాయి.
పీఎస్యూ బ్యాంక్స్, టాటా స్టీల్ 10 శాతం మేర నష్టపోయాయి. వీటితో పాటు అదానీపోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, లార్సెన్ నష్టాలను ఎదుర్కోగా.. భారతీ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, రిలయన్స్, కొటక్ మహింద్రా, ఐడియా సెల్యులార్లు లాభాలార్జించాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 30 పైసలు బలహీన పడి 64.21గా నమోదైంది.
మరిన్ని వార్తలు