అయిదవరోజూ లాభాల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆరంభ స్వల్ప నష్టాలనుంచి మిడ్ సెషన్ కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు టర్న్ అరౌండ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 60పాయింట్లు పుంజుకుని 33, 940 వద్ద, నిఫ్టీ15 పాయింట్ల మేర లాభపడి 10, 417 కోలుకుని స్థిరంగా ముగిశాయి. వరుసగా అయిదవ రోజుకూడా లాభాల్లో ముగియడం విశేషం. వేదాంతా, సన్ఫార్మ, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ ,టీసీఎస్ ఐఆర్బీ ఇన్ఫ్రా, ఫోర్టిస్ హెల్త్కేర్ లాభపడగా హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ , ఏసీసీ ఆల్కెమ్ నష్టపోయినవాటిల్లో ఉన్నాయి ఆర్ఐఎల్ తప్ప మిగతా ఆయిల్ షేర్లన్నీ నష్టపోయాయి.
మరిన్ని వార్తలు