సూపర్ సెన్సెక్స్@38వేల మార్కు
ముంబై : ఇంట్రాడేలోనూ... ముగింపులోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం కూడా చరిత్రాత్మక గరిష్ట స్థాయిలతో దంచికొట్టాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో, సెన్సెక్స్ సూపర్ అనిపించింది. మొట్టమొదటిసారి సెన్సెక్స్ 38వేల మార్కును తాకింది. నిఫ్టీ సైతం సరికొత్త రికార్డు గరిష్ట స్థాయిలతో లాభాల పంట పండించింది. ప్రస్తుతం 93 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 38వేల మార్కు కింద 37,980 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంలో 11,472 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే నడుస్తున్నాయి. ఎక్కువగా మెటల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి.
మెటల్స్తో పాటు ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్ షేర్లు కూడా దుమ్మురేపుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హిందాల్కో, వేదంత టాప్ గెయినర్లుగా నిలువగా.. లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్, అశోక్ లేల్యాండ్, ఎన్ఎండీసీ ప్రారంభంలో నష్టాలు పాలయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ప్రారంభంలో లాభపడింది. 14 పైసల లాభంలో 68.48 వద్ద ప్రారంభమైంది.
మరిన్ని వార్తలు