మార్కెట్ల వెనకడుగు : 10150 కిందికి నిఫ్టీ

Sensex Gives Up Most Of Day Gains, Nifty Struggles Above 10,150 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాల తరువాత  కాసింత ఉత్సాహంగా మొదలయ్యాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ  సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది.  కానీ అంతలోనే వెనకడుగు వేసింది.  ముఖ‍్యంగా 34వేల మార్క్‌ను అధిగమించినట్టే.. కనిపించినా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం 63 పాయింట్లు క్షీణించి 33,784వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 10,140 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో 10150 స్తాయిని కూడా నిఫ్టీ కోల్పోయింది. అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారని  నిపుణులు పేర్కొన్నారు.

మీడియా,  ఫార్మా  నష్టాల్లోనూ, రియల్టీ బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప లాభాల్లోనూ కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐబీ హౌసింగ్‌ బిగ్‌ విన్నర్స్‌గా ఉండగా,  యస్‌బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌, అంబుజా, ఎన్‌టీపీసీ, జీ, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌ నష్టపోతున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top