లాభాలన్నీ గోవింద, ఫ్లాట్‌ ముగింపు

Sensex Gives Up All Gains To End Flat - Sakshi

ముంబై : సరికొత్త శిఖరాలకు చేరుకున్న స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. చివరి గంటలో నెలకొన్న అమ్మకాల దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు తన లాభాలన్నింటినీ కోల్పో​యాయి. దీంతో మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 7 పాయింట్ల నష్టంలో 36,542 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంలో 11వేలకు పైన 11089 వద్ద స్థిరపడింది. ప్రారంభంలో అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉండగా.. చివరికి వచ్చేసరికి అన్నీ నష్టాలు పాలయ్యాయి.  

ఎక్కువగా ఫైనాన్సియల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా స్టాక్స్‌ నష్టపోయాయి. ఐటీ, ఎనర్టీ స్టాక్స్‌ టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టైటాన్‌, బీపీసీఎల్‌ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లు టాప్‌ లూజర్లుగా నిలిచాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా ప్రారంభ లాభాలను కోల్పోయింది. ప్రస్తుతం 8 పైసలు మాత్రమే లాభపడి 68.49 వద్ద ట్రేడవుతోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top