ఫుల్‌ జోష్‌: రికార్డు లెవల్‌ దిశగా నిఫ్టీ

Sensex gains over 100 points; Nifty50 above 10,100

ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేడు కూడా ఫుల్‌ జోష్‌గా ఉన్నాయి. నిన్నటి జోష్‌ను కొనసాగిస్తూ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ తన 10,100 మార్కును పునరుద్దరించుకుని, రికార్డు గరిష్ట స్థాయి దిశగా పరుగులు పెడుతోంది. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభాలను పండించింది. ప్రస్తుతం 160 పాయింట్ల లాభంలో 32,342 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 49 పాయింట్ల లాభంలో 10,100 మార్కుకు పైగా 10,145 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేటి మార్కెట్‌లో ర్యాలీ కొనసాగిస్తున్నాయి. 

టాటా టెలిసర్వీసెస్‌ను ఎయిర్‌టెల్‌ దక్కించుకుబోతున్నట్టు గురువారం ప్రకటించడంతో, ఎయిర్‌టెల్‌ షేర్లు 6 శాతం, టాటా టెలి షేర్లు 9 శాతం, టాటా కమ్యూనికేషన్‌ షేర్లు 2 శాతం పైకి ఎగిశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కూడా 3 శాతం పెరిగింది. రెండో క్వార్టర్‌ ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా లాభాలను పండిస్తోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ప్రారంభంలో 0.3 శాతం లాభపడింది. డాలర్‌ రూపాయి మారకం విలువ నేడు కూడా బలపడుతూ 20 పైసల లాభంలో 64.94 వద్ద కొనసాగుతోంది.    
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top