తొలిసారి 11,300ను దాటిన నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మారుమోగిపోతుంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో కూడా మార్కెట్లు రికార్డు స్థాయిల్లో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ సుమారు 100 పాయింట్ల మేర లాభపడి.. సరికొత్తగా 37,400 మార్కును చేధించింది. నిఫ్టీ కూడా తొలిసారి 11,300 మార్కును అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంలో 37,411 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంలో 11,296 వద్ద ట్రేడవుతున్నాయి.
నేటి ట్రేడింగ్లో బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. పీపీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ళ మద్దతు కొనసాగుతోంది. వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం మేర లాభపడుతూ.. ముందంజలో ఉంది. జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ భారీ నష్టాలను నమోదు చేసినప్పటికీ, షేర్లు మాత్రం చాలా బలంగా ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో రూ.303.30 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తన ఫలితాల్లో మంచి లాభాలను ఆర్జించడంతో, ఈ కంపెనీ షేరు కూడా రికార్డు గరిష్టాల్లోకి ఎగిశాయి.
మరిన్ని వార్తలు