రిలయన్స్ జోరు : డబుల్ సెంచరీ లాభాలు

Sensex gains 200 points,RIL hits new high - Sakshi

10100 ఎగువన స్థిరంగా నిఫ్టీ 

రికార్డు స్థాయికి  రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు ఎగిసి 34425 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 10158 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సహా అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.  బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లతో నిప్టీ బ్యాంకు 21వేల ఎగువన స్థిరంగా కొనసాగుతోంది.

ప్రధానంగా  వరుస పెట్టుబడులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1682 రూపాయల  వద్ద సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసి దూసుకుపోతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్, కాడిలా హెల్త్‌కేర్‌తో సహా మొత్తం 46 కంపెనీలు తమ మార్చి త్రైమాసిక ఆదాయాన్ని ఈ రోజు ప్రకటించనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top