నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ 9150 దిగువకు చేరింది. స్వల్ప రికవరి సాధించిన సెన్సెక్స్ ప్రస్తుతం 424 పాయింట్లు కోల్పోయి31430 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 9196 వద్ద కొనసాగుతున్నాయి. ఒక దశలో తద్వారా నిఫ్టీ 92 వందల స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ స హా అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. జీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, టీసీఎస్ నష్టపోతున్నాయి. మరోవైపు హెచ్ సీఎల్ టెక్, సిప్లా, సన్ ఫార్మ, లార్సెన్, హీరో మోటో, బ్రిటానియా, టెక్ మహీంద్ర, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి.