నష్టాల్లో  సూచీలు

Sensex Falls Over 200 Points Nifty Below 11650 - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గ్లోబల్‌ సంకేతాలకు తోడు దేశీయంగా ఎన్నికల వాతావరణం నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు  అనంతరం మరింత క్షీణించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌223 పాయింట్లు క్షీణించి 38,718  వద్ద  నిఫ్టీ 55 పాయింట్లు  నష్టపోయి 11,623 వద్ద ట్రేడవుతోంది. అటు ప్రపంచ వృద్ధి అంచనాలలో ఐఎంఎఫ్‌ కోత విధించిన నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. మరోపక్క యూరోపియన్‌ గూడ్స్‌పై 11 బిలియన్‌ డాలర్ల విలువైన టారిఫ్‌లను విధించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు  అభిప్రాయపడుతున్నారు.

రియల్టీ, ఫార్మా పాజిటివ్‌గాను,  బ్యాంక్ నిఫ్టీ  నెగిటివ్‌గాను ట్రేడ్‌ అవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ టాప్‌ లూజర్స్‌గా ఉంది. మరోవైపు   ఆసియన్‌ పెయింట్స్‌, హిందాల్కో,  టైటన్‌ గెయిల్‌ టాప్‌  లూజర్స్‌గా ఉన్నాయి.  అటు ఫార్మ షేర్లలో సిప్లా, బయోకాన్‌, పిరమల్‌, గ్లెన్‌మార్క్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో, కేడిలా హెల్త్‌, సన్‌ఫార్మా, దివీస్‌ 3.3-0.65 శాతం మధ్య  పుంజుకున్నాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌ దాదాపు 10 శాతం, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌టెక్‌, బ్రిగేడ్‌, శోభా, పీనిక్స్‌, మహీంద్రా లైఫ్‌ 4.2-0.75 శాతం లాభపడుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top