లాభాల నుంచి వెంటనే నష్టాల్లోకి..
ముంబై : వాల్స్ట్రీట్ నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, ప్రారంభ లాభాలు హరించుకుపోయాయి. 90 పాయింట్ల మేర లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రస్తుతం 15 పాయింట్లు పడిపోయి 33,864 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 26 పాయింట్ల లాభం నుంచి 3 పాయింట్ల నష్టాల్లోకి జారుకుంది.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీలు నష్టాల బాట పట్టాయి. దీంతో పాటు ఆసియన్ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సంకేతాలు వస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాలు పండించగా.. ఓఎన్జీసీ, హిందాల్కో, నాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ నష్టాల్లో నడిచాయి.
మరిన్ని వార్తలు