3 రోజుల ర్యాలీకి బ్రేక్
వరుసగా మూడు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు ఆర్జించిన లాభాలకు బ్రేక్ పడింది. చివరి గంటలో నెలకొన్న తీవ్ర అమ్మకాల ఒత్తిడితో మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కిందకి దిగజారి, 33,227 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంలో 10,240 వద్ద క్లోజయ్యాయి. తొలి నుంచి ప్రతికూలంగానే కదలాడిన మార్కెట్లు, మిడ్ సెషన్ నుంచి అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో చివరిలో ఇంట్రాడే కనిష్టానికి చేరాయి. ఎన్ఎస్ఈలో అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, మెటల్, ఫార్మా 1.6-0.7 శాతం మధ్య కిందకి పడిపోయాయి.
నిఫ్టీ దిగ్గజాలలో హెచ్పీసీఎల్, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐషర్, యూపీఎల్, హీరోమోటో, ఐవోసీ, సిప్లా, టీసీఎస్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, గెయిల్, లుపిన్, ఇన్ఫోసిస్ మాత్రమే 3-0.5 శాతం మధ్య లాభాలను ఆర్జించాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసల నష్టంలో 64.42గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 172 రూపాయల నష్టంలో రూ.28,175గా ఉన్నాయి.