గరిష్ట స్థాయిలకు పైన మార్కెట్లు: ఐటీ అదుర్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఆరవరోజు కూడా లాభాలతో ఉత్సాహంగా ముగిశాయి. ఫ్లాట్ నోట్తో ప్రారంభమైనా...కొనుగోళ్ల మద్దతుతో మిడ్ సెషన్లో ఒక దశలో 200పాయింట్లకు పైగా పుంజుకుంది. చివరకు సెన్సెక్స్ 161 పాయింట్లు లాభంతో 34,101 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10,458 వద్ద స్థిరపడ్డాయి. కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు (సెన్సెక్స్ 34వేలు,నిప్టీ 10450) అధిగమించాయి. బ్యాంకింగ్, ఐటీ లాభాల్లోనూ ఫార్మా, షుగర్ షేర్లు నష్టాల్లోనూ ముగిశాయి. హెచ్సీఎల్టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ , రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్, టాప్ విన్నర్స్గా ఉన్నాయి. ముఖ్యంగా త్రైమాసిక ఫలితాలపై పాజిటివ్ అంచనాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ బాగా లాభపడింది. మరోవైపు డా.రెడ్డీస్, లుపిన్, వేదాంత, సెయిల్, వక్రంగీ, భారతి ఎయిర్టెల్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.