మూడీస్‌ జోరు: భారీ లాభాల్లో ముగింపు

Sensex ends 236 pts higher; Nifty50 above 10,250 - Sakshi - Sakshi - Sakshi

ముంబై :  గ్లోబల్‌ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్‌ దేశ సావరిన్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో మార్కెట్లు మహా జోరుతో కొనసాగాయి. ఇటు ప్రభుత్వ రంగ, అటు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ సరికొత్త రికార్డు స్థాయికి ఎగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు కూడా భారీ లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో 400 పాయింట్ల మేర ఎగిసిన సెన్సెక్స్‌, చివరికి 235.98 పాయింట్ల లాభంలో 33,342 వద్ద, నిఫ్టీ 68.85 పాయింట్ల లాభంలో 10,283 వద్ద క్లోజయ్యాయి. మూడీస్‌ ఇన్వెస్టర్‌ దేశ సావరిన్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం మార్కెట్లకు మంచి జోష్‌నిచ్చింది. అంతేకాక కేంద్ర కేబినెట్‌ వడ్డీ రాయితీ పథకంలో భాగంగా గృహ నిర్మాణ భూపరిమితిని పెంచడంతో రియల్టీ రంగం 3.7 శాతం జంప్‌ చేసింది.

కాగా.. డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 60 పైసలు జంప్‌ చేయడంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 2-0.8 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ 1.5 శాతం క్షీణించింది. బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, మారుతీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, సన్‌ ఫార్మా, హిందాల్కో, వేదాంతా, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌ 2.3-1.6 శాతం మధ్య ఎగిశాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, బాష్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, గెయిల్‌, యూపీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ 3-1 శాతం నష్టపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top