మెటల్ మెల్ట్ : లాభాలు ఆవిరి
సాక్షి, ముంబై: దేశీ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. రెండు రోజుల నష్టాలకు చెక్పెడుతూ లాభాలతో ప్రారంభమైనా మిడ్సెసన్లో అమ్మకాలు ఊపందుకుకోవడంతో లాభాలన్నీ అవిరైపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్లు క్షీణించి 35,129వద్ద, నిఫ్టీ26 పాయింట్లు నీరసించి 10,574 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 10600 దిగువకు చేరింది. ప్రధానంగా మెటల్, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా రంగాలు నష్టపోతున్నాయి. మరోవైపు మీడియా , ఐటీ స్వల్పంగా లాభపడుతున్నాయి.
ఎంఅండ్ఎం, హిందాల్కో, అల్ట్రాటెక్, పవర్గ్రిడ్, బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, విప్రో టాప్ లూజర్స్గా ఉన్నాయి. జీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐబీ హౌసింగ్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, హీరోమోటో లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ వరుసగా లాభాలతో మెరుగ్గా ఉంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి రూ.71.03 వద్ద ఉంది.