నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Sensex Drops Over 200 Points Nifty below11000 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ఆరంభమైనాయి.  అక్టోబర్‌ 2, గాంధీ జయంతి సెలవు అనంతరం ప్రారంభమైన  కీలక సూచీల్లో అమ్మకాల ఒత్తిడి ధోరణి నెలకొంది.  సెన్సెక్స్ 198పాయింట్లు నష్టపోయి 36,327వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు నీరసించి 10, 931వద్ద కొనసాగుతోంది. అటు డాలర్ మారకంతో  రూపీ పతనం గరిష్టంగా 73.30 పైసలకు చేరడంతో మార్కెట్లు నెగిటివ్‌  జోన్‌లోకి మారాయి.

ఎస్ బ్యాంక్ , కోటక్ మహీంద్ర ,  టాటాస్టీల్, సిప్లా , టెక్ మహీంద్ర షేర్లు టాప్ గెయినర్లు కాగా,  ఐషర్ మోటర్స్, భారతీ ఇన్ఫ్రాటెల్ , గ్రాసిమ్ , మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top