చివరకు నష్టాలే..
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంనుంచి స్తబ్దుగా స్వల్ప లాభాలతో కదలాడిన సూచీలు చివరికి భారీ నష్టాలను మూటగట్టకున్నాయి. చివరి అర్థగంటలో అమ్మకాలు భారీగా నెలకొనడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 181 పాయింట్లు 34,134వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 10245 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం డెరివేటివ్ కౌంటర్ ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించినట్టు నిపుణులు పేర్కొన్నారు. ఇండస్ఇండ్, బీపీసీఎల్,ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పెయింట్స్, రిలయన్స్, నష్టపోగా, ఇండియా బుల్స్, ఐసీఐసీఐ, హెచ్సీఎల్, ఇషర్ మోటార్స్ లాభాల్లో ముగిసాయి.
మరిన్ని వార్తలు