నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంలో 36,534 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంలో 11వేల మార్కు కిందకి 10,999 వద్ద కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్లో మెజార్టీ రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ స్టాక్స్ ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం దాదాపు 2 శాతం పతనమైంది. బైబ్యాంక్ జారీని రద్దు చేయడంతో, పీసీ జ్యువెల్లరీ షేర్ భారీగా 25 శాతం మేర నష్టపోతోంది. టాటా మోటార్స్ కంపెనీ షేర్లు కూడా 4 శాతం మేర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
కంపెనీ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ను మూడీస్ డౌన్గ్రేడ్ చేయడంతో టాటా మోటార్స్ నష్టాలు పాలవుతోంది. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 8.6 శాతం కుప్పకూలగా.. ఐసీఐసీఐ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, లుపిన్, గ్రాసిమ్, ఆర్ఐల్, హెచ్పీసీఎల్, యూపీఎల్, యస్బ్యాంక్ 2.5-1.25 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు జీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, టీసీఎస్, ఎన్టీపీసీలు పుంజుకున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా స్వల్ప నష్టంలో ప్రారంభమైంది. ప్రస్తుతం 2 పైసలు బలపడి 68.55 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని వార్తలు