నష్టాల ప్రారంభం: బంధన్‌ బ్యాంక్‌ ఢమాల్‌

Sensex currently at 36,109 Nifty at 10,874  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతోప్రారంభమైనాయి. నిఫ్టీ 11వేలకు దిగువనేట్రేడ్‌అవుతోంది. సెన్సెక్స్‌ 117 పాయింట్లు కోల్పోయి 32, 109 వద్ద,నిప్టీ 56 పాయింట్లు క్షీణించి 10,874 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ భారీగా నష్టపోతోంది. ఇంకా మెటల్‌, ఆటో, విమానరంగ షేర్లు నష్టపోతున్నాయి. అయితే రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లు పుంజుకున్నాయి.

ప్రధానంగా బంధన్‌ బ్యాంకు 20శాతం పతనమైంది. సీఈవో రెమ్యునరేషన్‌ చెల్లింపులను ప్రస్తుతానికి నిలిపివేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడటంతో ‍ ప్రైవేటురంగ సంస్థ   బంధన్‌ బ్యాంకు కౌంటర్లో అమ్మకాలకు  తెర లేచింది. ఇంకా కోటక్‌బ్యాంకు, ఎస్‌బ్యాంకు కూడా ఇదే బాటలో ఉన్నాయి. వీటితోపాటు  బజాజ్‌ ఆటో, జెట్‌ ఎయిర్‌ వేస్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఇండియా బుల్స్‌ , టాటా స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌ నష్టాల్లో కొనసాగుతోంది. మరోవైపు గెయిల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఐటీసీ లాభపడుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top