లాభాల ప్రారంభం : సన్ ఫార్మా ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయంగా సానుకూల ధోరణి నేపథ్యంలో కీలక సూచీలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో జోరు మీద ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 216 పాయింట్ల లాభంతో 36410 వద్ద, నిఫ్టీ 55పాయింట్లు ఎగిసి 10,992 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ 10900కి ఎగువన స్థిరంగా11వేల దిశగా సాగుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాల పంట పండిస్తున్నాయి.
హిందాల్కో, వేదాంతా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బ్యాంకు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. సన్ఫార్మా 8శాతం పతనమై టాప్ లూజర్గా ఉంది. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయిక పరుగుకు స్వల్ప బ్రేక్పడింది. సోమవారం రుపీ 28పైసలు నష్టపోయింది. 69.87 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
మరిన్ని వార్తలు