తొలిసారి 11,400 మార్కును తాకిన నిఫ్టీ

Sensex Climbs 200 Pts, Nifty50 Hits 11400 For First Time - Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల జోరు కొనసాగిస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు హైజంప్‌ చేశాయి. నిఫ్టీ తొలిసారి 11,400 మార్కును తాకేసింది. సెన్సెక్స్‌ సైతం రికార్డు స్థాయిల్లోకి జంప్‌ చేసింది.  220 పాయింట్ల లాభపడి 37,776.75 వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 229 పాయింట్ల జోరుతో 37,785 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 59 పాయింట్ల లాభంలో 11,400 పైన 11,419 వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అన్ని రంగాల సూచీలు లాభాలతో అదరగొడుతున్నాయి.

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కూడా మేజర్‌ సూచీలకు తగ్గట్టు లాభాల్లో దంచికొడుతున్నాయి. అటు ట్రేడింగ్‌ ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ లాభాల్లో ప్రారంభమైంది. శుక్రవారం 68.61 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 68.57 వద్ద ట్రేడైంది. . నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌, ఐసీఐసీఐ, టాటా మోటార్స్‌, వేదాంతా, సన్‌ ఫార్మా, లుపిన్‌ 1.6-1 శాతం మధ్య లాభపడుతుండగా.. బ్లూచిప్స్‌లో కేవలం ఐబీ హౌసింగ్‌, హెచ్‌యూఎల్‌లు 0.5 శాతం బలహీనంగా ట్రేడవుతున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top